లార్డ్స్ లో పుజారా, రహానే పోరాటం... సెంచరీ దాటిన భారత్ ఆధిక్యం

  • భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు
  • లార్డ్స్ మైదానంలో మ్యాచ్
  • రెండో ఇన్నింగ్స్ లో కుదురుకున్న టీమిండియా
  • 112 పరుగులకు చేరిన ఆధిక్యం
లార్డ్స్ టెస్టులో భారత్ కోలుకుంది. రెండో ఇన్నింగ్స్ లో ఓ దశలో 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్ ఆపై పుజారా, రహానేల పోరాటంతో పుంజుకుంది. ప్రస్తుతం భారత్ స్కోరు 3 వికెట్లకు 139 పరుగులు కాగా, ఆధిక్యం 112 పరుగులకు పెరిగింది. రహానే అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, 186 బంతులు ఎదుర్కొన్న పుజారా 37 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

ఈ జోడీని విడదీయడానికి ఇంగ్లండ్ బౌలర్లు సర్వశక్తులు ఒడ్డినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 364 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 391 పరుగులు చేసింది. ఇవాళ ఆటకు నాలుగో రోజు కాగా, రేపటి ఆట మరింత రసవత్తరంగా ఉండనుంది.

Team India
Ajinkya Rahane
Cheteshwar Pujara
Lord's
England

More Telugu News